Corona Virus: భారత్‌లో ఒక్క‌రోజులో 90,802 క‌రోనా కేసులు.. 42 లక్షలు దాటిన మొత్తం కేసులు

India reports 90802 Corona cases  Sep 6th
  • మొత్తం కేసులు 42,04,614
  • మృతుల సంఖ్య మొత్తం 71,642
  • కోలుకున్న‌ వారు 32,50,429 మంది
  • యాక్టివ్ కేసులు 8,82,542  
భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 90,802 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదే సమయంలో 1,016  మంది మృతి చెందారు.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,04,614కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 71,642కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 32,50,429   మంది కోలుకున్నారు. 8,82,542 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                               
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,95,51,507 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 7,20,362 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID-19
India

More Telugu News