పీవీకి భారతరత్న ప్రకటించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం!: కేసీఆర్
- తెలంగాణ అస్తిత్వానికి పీవీ ప్రతీక
- దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిన మహానేత
- నెక్లెస్ రోడ్డుకు 'పీవీ జ్ఞానమార్గ్' అనే పేరును పెడుతున్నామన్న సీఎం
భారతరత్న పురస్కారానికి పీవీ అన్ని విధాలా అర్హులని చెప్పారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తీర్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నెక్లెస్ రోడ్డుకు 'పీవీ జ్ఞానమార్గ్' అనే పేరును పెట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాదులో పీవీ మెమోరియల్ నిర్మిస్తామని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఈరోజు కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు.