క్లినికల్ ట్రయల్స్ పై రాసేటప్పుడు మీడియా నియంత్రణ పాటించాలి: ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా
- 73 రోజుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వస్తోందంటూ కథనాలు
- క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియను వక్రీకరించరాదన్న అదార్ పూనావాలా
- త్వరలో డేటా వెల్లడిస్తామని వివరణ
ఈ ప్రక్రియను వక్రీకరించే ప్రయత్నం చేయరాదని, ఈ క్లినికల్ ట్రయల్స్ ను గౌరవిద్దామని పిలుపునిచ్చారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొంటున్న వలంటీర్ల ఆరోగ్య పరిస్థితి గురించి రెండు నెలలు వేచి చూద్దామని తెలిపారు. కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడి చేస్తామని అదార్ పూనావాలా ట్విట్టర్ లో పేర్కొన్నారు. 73 రోజుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ భారత్ లో అందుబాటులోకి వస్తుందని కొన్నిరోజుల కిందట మీడియాలో ప్రముఖంగా రావడం తెలిసిందే.