స్వార్థానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: సజ్జల రామకృష్ణారెడ్డి
- గత ఐదేళ్లు చంద్రబాబు స్వార్థం కోసమే ఆలోచించారు
- రూ. 3 లక్షల కోట్లకు పైగా అప్పును ప్రజలపై పెట్టారు
- కరోనా సమయంలో ఆయన ఎక్కడకు వెళ్లారు?
ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తున్న గొప్ప ప్రభుత్వం జగన్ దని సజ్జల అన్నారు. 14 నెలల పాలనలో రూ. 53 వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా సమర్థవంతంగా పని చేస్తోందని చెప్పారు. కరోనా సమయంలో చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. జగన్ సంక్షేమ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రాక్షసుడిలా అడ్డుకుంటున్నారని విమర్శించారు.