దేశంలో కరోనా కేసులు మూడు లక్షలు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ రికార్డు: దేవినేని ఉమ విమర్శలు
- 11 రోజుల్లోనే ఏపీలో కొత్తగా లక్ష కేసులు
- 3,06,261 కేసులు, 2,820 మరణాలు
- దేశంలో 10 వేల కేసులు దాటిన 50 జిల్లాల్లో 13 మనవే
'3,06,261 కేసులు, 2,820 మరణాలు. దేశంలో మూడు లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రంగా రికార్డు. 11 రోజుల్లోనే మూడో లక్ష కూడా.. కేసుల పెరుగుదలలో మొదటిస్థానం. దేశంలో 10 వేల కేసులు దాటిన 50 జిల్లాలలో 13 మనవే. కరోనా వారియర్స్ తో మాట్లాడి ప్రజలకు మనో ధైర్యం కల్పించాలన్న చంద్రబాబు నాయుడి గారి మాటలు మీకు వినబడుతున్నాయా.. జగన్ గారు?' అని దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విట్టర్లో ప్రశ్నించారు.