మోదీ కేబినెట్లో అత్యుత్తమ మంత్రి ఈయనేనట.. 'ఇండియాటుడే-కార్వీ ఇన్ సైట్స్' సర్వేలో వెల్లడి

  • మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకున్న 66 శాతం మంది
  • బెస్ట్ మినిస్టర్ గా అమిత్ షాకు ఓటు
  • తర్వాతి స్థానాల్లో రాజ్ నాథ్, గడ్కరీ
ఇండియాటుడే - కార్వీ ఇన్ సైట్స్ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధాని మోదీనే మళ్లీ ప్రధాని కావాలని 66 శాతం మంది కోరుకున్నారు. మరోవైపు మోదీ కేబినెట్లో అత్యున్నత పని తీరును కనబరుస్తున్న మంత్రిగా అమిత్ షాకే ఎక్కువ మంది ఓటేశారు. 39 శాతం మంది అమిత్ షా బెస్ట్ మినిస్టర్ అని కితాబిచ్చారు. ఆ తర్వాత స్థానంలో రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. 17 శాతం మంది రాజ్ నాథ్ సింగ్ కు ఓటేశారు. వీరి తర్వాతి స్థానాల్లో వరుసగా నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, జైశంకర్ ఉన్నారు.

India Today Survey
Mood of the Nation
Narendra Modi
Amit Shah
Best Minister

More Telugu News