Vijayasai Reddy: 'విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడు!' అంటూ ఫేస్ బుక్ లో విజ‌య‌సాయిరెడ్డి సుదీర్ఘ పోస్ట్

vijaya saireddy slams chandrababu naidu
  • వీధికో బెల్ట్ షాపు పెట్టించారు
  • నదుల్లోని ఇసుక దోచుకున్నారు
  • గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలను కొల్లగొట్టారు
'విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడు' అంటూ వైసీపీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. వైఎస్ లాగే జగన్ తన హయాంలో ఆ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.        
 
'వీధికో బెల్ట్ షాపు పెట్టించడం.. నదుల్లోని ఇసుక దోచుకోవడం..  గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలను కొల్లగొట్టడం, పచ్చని కొండల్లో అగ్గి రాజేయడం తప్ప చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో విజయనగరానికి చేసిందేమీ లేదు' అంటూ విజయసాయి విమర్శించారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu

More Telugu News