మసీదు శంకుస్థాపనకు వెళ్తారా? అనే ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్ సమాధానం ఇదే!
- మసీదు శంకుస్థాపనకు నన్ను ఎవరూ పిలవరు
- పిలవనప్పుడు నేను వెళ్లను
- నా పనిని ఒక ధర్మంగా భావిస్తాను
ఈ ప్రశ్నకు యోగి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మసీదు శంకుస్థాపనకు తనను ఎవరూ పిలవరని యోగి అన్నారు. తనను పిలవనప్పుడు తాను వెళ్లనని చెప్పారు. తన పనిని ఒక కర్తవ్యంగా, ధర్మంగా భావిస్తానని తెలిపారు. అన్ని మతాల ప్రజలు శాంతిసామరస్యాలతో కలిసి, మెలిసి బతకాలని తాను కోరుకుంటానని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మసీదు నిర్మాణ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.