కరోనా నుంచి కోలుకున్న నాలుగు రోజులకే కన్నుమూసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్
- గత నెలలో కరోనా బారినపడిన మాజీ సీఎం
- పూణె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న వైనం
- కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూత
శివాజీరావు 3 జూన్ 1985 నుంచి 6 మార్చి 1986 వరకు కొద్దికాలంపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఆయన నీలంగ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1962 నుంచి ఏడుసార్లు రాష్ట్రంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నారు.