Chandrababu: విశాఖలో క్రేన్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

  • హిందూస్థాన్ షిప్ యార్డులో ప్రమాదం
  • 10 మంది మృతి!
  • భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్
TDP Chief Chandrababu responds on crane accident at Hindusthan Ship Yard in Vizag

విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్ యార్డులో ఓ భారీ క్రేన్ కూలి పది మంది చనిపోయారన్న వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోందని, వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ మధ్యాహ్నం విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో క్రేన్ కింద నలిగిపోయి పలువురు మృత్యువాత పడ్డారు. క్రేన్ కింద ఇంకా కొందరు ఉన్నట్టు భావిస్తున్నారు.

More Telugu News