రెబల్ ఎమ్మెల్యేలకు 'అపరిమిత ఆఫర్లు': బీజేపీపై గెహ్లాట్ ఫైర్
- తొలుత రూ. 10 కోట్లు ఇచ్చారు.. ఆ తర్వాత రూ. 15 కోట్లు ఆఫర్ చేశారు
- ఇప్పుడు ఎంత కావాలో చెప్పాలంటున్నారు
- మాయావతి బీజేపీకి వంత పాడుతున్నారు
మరోవైపు, బీఎస్పీ చీఫ్ మాయావతిపైనా గెహ్లాట్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టులో మాయావతి సవాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె బీజేపీకి వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ రిట్ పిటిషన్పై నిన్న స్పందించిన హైకోర్టు ఆగస్టు 11 లోగా స్పందించాలని ఆదేశించింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, శాసన సభ కార్యదర్శి, బీఎస్పీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.