అసలు ఏపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర వ్యాఖ్యలు
- నిమ్మగడ్డ కేసులో ప్రతి విషయం మాకు తెలుసు
- గవర్నర్ ఆదేశించేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది?
- శుక్రవారం లోపు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి
నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇవ్వాలంటూ గవర్నర్ లేఖ పంపినా పాటించకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గవర్నర్ ఆదేశించేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం. వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.