కావలి ఉద్రిక్తతలపై స్పందించిన బాలకృష్ణ... ఎంతవరకైనా వెళదాం అంటూ భరోసా
- కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు
- టీడీపీ కార్యకర్తల సమావేశానికి పోలీసుల అభ్యంతరం
- ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం ఉండాల్సిందేనన్న బాలయ్య
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేశారు. నందమూరి అభిమానులకు తాను భరోసాగా ఉంటానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ విగ్రహం ఉండాల్సిందేనని అన్నారు. సమావేశం విరమించవద్దని అభిమానులకు సూచించారు. కేసులకు భయపడవద్దని, ఎంతవరకైనా పోరాడదామని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.