కేసీఆర్, జగన్ లకు ప్రధాని ఫోన్... కరోనా పరిస్థితులపై ఆరా
- దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
- పెరుగుతున్న వైరస్ వ్యాప్తి
- తెలుగు రాష్ట్రాల్లో చర్యలపై సీఎంలను అడిగి తెలుసుకున్న మోదీ
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలతోనూ ప్రధాని ఫోన్ ద్వారా సంభాషించారు. బీహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతోనూ కరోనా పరిణామాలపై చర్చించారు. రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు.