'నెల్లూరులో జేసీబీ సాయంతో కరోనా మృతుల ఖననం'పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!
- మృతదేహాలను గుంతలోకి విసిరేసిన జేసీబీ
- వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు
- విచారణాధికారిగా నెల్లూరు ఆర్డీవో నియామకం
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ను ప్రత్యేక అధికారిగా నియమించారని, ఆయన ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇటీవల రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, అమానవీయ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.