India: దేశంలో 7,42,417కి చేరిన కరోనా కేసులు

India reports a spike of 22752 new COVID19 cases
  • గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి కరోనా
  • కేసుల సంఖ్య మొత్తం 7,42,417
  • మృతుల సంఖ్య మొత్తం 20,642
  • 2,64,944 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 482 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,42,417 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,642కి పెరిగింది. 2,64,944 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,56,831 మంది కోలుకున్నారు.
                             
నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,04,73,771 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,62,679 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
India
Corona Virus
COVID-19

More Telugu News