3T Cricket: 3టీ టోర్నీతో క్రికెట్ సందడికి శ్రీకారం చుట్టనున్న దక్షిణాఫ్రికా

South Africa set to conduct three team cricket tourney
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచం స్తంభించడంతో క్రికెట్ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే పలు జట్లు క్రికెట్ సిరీస్ లకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలో మళ్లీ క్రికెట్ ఊపందుకునే దిశగా 3టీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు.

 మూడు జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ నెల 18 నుంచి జరగనుంది. ఇందులో పాల్గొనే కైట్స్ జట్టుకు క్వింటన్ డికాక్, ఈగిల్స్ జట్టుకు ఏబీ డివిలియర్స్, కింగ్ ఫిషర్స్ టీమ్ కు కగిసో రబాడా నాయకత్వం వహిస్తారు. ఒక్కో జట్టులో 8 మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ఈ టోర్నీ కోసం దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇప్పటినుంచే సాధన చేస్తున్నారు. 3టీ టోర్నీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందుల పాలవుతున్న వారికి అందిస్తారు.

Go Back to Shorts
3T Cricket
South Afrcia
Cricket
Corona Virus

More Telugu News