గుండెపోటుతో మృతి చెందిన ఏపీ హైకోర్టు ఇన్చార్జి రిజిస్ట్రార్ జనరల్

AP High Court registrar general died of heart attack
  • విధుల్లో ఉండగా గుండెపోటుకు గురైన రాజశేఖర్
  • హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ మృతి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటుతో మరణించారు. హైకోర్టులో విధుల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

రిజిస్ట్రార్ జనరల్ గా నిన్ననే ఓ మహిళాధికారిని నియమించారు. ఈ నెల 30లోపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.  ప్రస్తుతం రాజశేఖర్ ఇన్చార్జి రిజిస్ట్రార్ జనరల్  గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణంతో హైకోర్టు ప్రాంగణం విషాదంలో మునిగిపోయింది.
Go Back to Shorts
AP High Court
Registrar General
Dead

More Telugu News