Corona Virus: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి... 24 గంటల్లో 443 పాజిటివ్ కేసులు

Corona spike continues in AP
  • ఏపీలో 9,372కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • తాజాగా 83 మంది డిశ్చార్జి
  • రాష్ట్రంలో మరో ఐదుగురి మృతి
ఏపీలో కరోనా రక్కసి వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 443 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో 51 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారివిగా గుర్తించారు. మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు 9,372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 83 మంది డిశ్చార్జి కాగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,435కి పెరిగింది. ప్రస్తుతం 4,826 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 5 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 111కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.
Corona Virus
Andhra Pradesh
Positive
Deaths
COVID-19

More Telugu News