మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ దిశగా ... మోదీ నిర్ణయం తీసుకుంటారా?
- నేడు, రేపు సీఎంలతో సమావేశాలు
- ఆపై కీలక నిర్ణయం తీసుకోనున్న మోదీ
- మరోసారి లాక్ డౌన్ ఖాయమంటున్న అత్యధికులు
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ
ఈ రెండు రోజుల సమావేశాల అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.. ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడకున్నా, మోదీ మాట్లాడటం లేదా మీడియా ద్వారా ప్రకటన విడుదల చేయడం ఖాయంగా తెలుస్తోంది.
ఇండియాలో మరోసారి లాక్ డౌన్ ఖాయమేనని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకోవడంతో, కేసుల సంఖ్యను తగ్గించాలంటే, లాక్ డౌన్ ఒక్కటే మార్గమని, మరోమారు ప్రజా రవాణాలను, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనులను నిలిపివేస్తే, ప్రజలు ఇంటికే పరిమితమవుతారని, తత్ఫలితంగా కేసుల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.