బార్లలో ఉన్న మద్యాన్ని ఇలా అమ్మేయండి: ఏపీ ప్రభుత్వం
- బార్లకు ఇంకా లభించని అనుమతి
- బాటిల్స్ స్టాక్ ఉండటంతో యజమానులకు నష్టాలు
- రీటెయిల్ షాపుల్లో అమ్ముకునేందుకు బార్లకు అనుమతి
బార్లలో స్టాక్ ఉన్న మద్యం బాటిళ్లను రీటెయిల్ ఔట్ లెట్లలో విక్రయించుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. అయితే సీల్డ్ బాటిళ్లను మాత్రమే అమ్మాలని షరతు విధించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బార్ల యజమానులకు ఊరట లభించినట్టయింది.