కరోనా ఎఫెక్ట్: ఏయూలో హాస్టళ్లు ఖాళీ చేయాలంటూ విద్యార్థులకు ఆదేశాలు
- విశాఖలో కరోనా ప్రభావం
- హాస్టల్ భవనాలను క్వారంటైన్ కేంద్రాలు మలిచేందుకు ప్రయత్నం
- హాస్టళ్లను వీడుతున్న విద్యార్థులు
ఇక్కడి ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దాంతో ఏయూ అధికారులు హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ విద్యార్థులను ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో విద్యార్థులు తమ హాస్టళ్లను వీడుతున్నారు. కేసులు ఎక్కువయ్యే క్రమంలో ఈ భవనాలు క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.