Corona Virus: ఏపీలో మరో 79 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
  • 24 గంటల్లో 8,066 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసులు 3,279
  • ఆసుపత్రుల్లో కరోనాకు 967 మందికి చికిత్స  
  • 2,244 మంది డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 8,066 శాంపిళ్లను పరీక్షించగా మరో 79 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,279 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 967 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,244 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 68కి చేరింది.
                       
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News