Corona Virus: ఏపీలో మరో 76 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
  • గత 24 గంటల్లో 10,567 శాంపిళ్ల  పరీక్ష
  • మరో  76 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసులు 3,118
  • ఆసుపత్రుల్లో కరోనాకు 885 మందికి చికిత్స  
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 10,567 శాంపిళ్లను పరీక్షించగా మరో  76 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,118 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 885 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,169 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది.
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News