సీఎం జగన్ అసలు రూపం బయటపడింది: కన్నా లక్ష్మీనారాయణ
- రాష్ట్రంలో మద్యం ఏరులైపారింది
- పనుల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
- సీఎం జగన్కు ఏమీ పట్టట్లేదు
- ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చారు
అప్రజాస్వామిక పనులను ప్రశ్నించకూడదా? అని కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రజాస్వామికం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో చేపట్టిన నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఏడాది కాలంగా పోలవరాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్దీ జగన్ అసలు రూపం బయటపడిందని, ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు తన నిజస్వరూపాన్ని చూపుతున్నారని విమర్శించారు.