రేపటి నుంచి పట్టాలెక్కనున్న 200 రైళ్లు
- నేటితో నాలుగో విడత లాక్ డౌన్ ముగింపు
- సోమవారం నుంచి వివిధ మార్గాల్లో రైళ్లు
- రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ తప్పనిసరి అన్న రైల్వే శాఖ
- లక్షణాలు లేనివారికే ప్రయాణానికి అనుమతి
ప్రస్తుతం 30 శ్రామిక్ రైళ్లు నడుస్తుండగా, ఈ 200 రైళ్లు వాటికి అదనం. ఈ సందర్భంగా రైల్వే శాఖ ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడించింది. కన్ఫాం, ఆర్ఏసీ టికెట్ ఉన్నవారినే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రయాణికులంతా 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని సూచించింది. రైల్వే స్టేషన్ లో స్క్రీనింగ్ తప్పనిసరి అని, లక్షణాలు లేని వారికే అనుమతి లభిస్తుందని తెలిపింది.