Corona Virus: ఏపీలో మరో 98 మందికి కరోనా నిర్ధారణ.. 3,000 దాటిన కేసులు

coronavirus cases in ap
  • గత 24 గంటల్లో 9,370 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసులు 3042
  • 845 మందికి చికిత్స
  • 2,135 మంది డిశ్చార్జ్  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,370 శాంపిళ్లను పరీక్షించగా మరో  98 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 43 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,042  అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 845 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 62కి చేరింది.
.
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News