హైకోర్టు తీర్పుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సుమోటోగా తీసుకోవాలి: జనసేన

న్యాయస్థానాల తీర్పులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఖండించింది. నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలు సరికాదని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. హైకోర్టు తీర్పులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. న్యాయస్థానాలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.  

Janasena
Andhra Pradesh
YSRCP

More Telugu News