బంగారం పరుగుకు నేడు బ్రేక్... తగ్గిన ధర!
- గత మూడు రోజులుగా పెరిగిన ధర
- అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చిన పుత్తడి
- ఇండియాలో రూ. 46,978కి పది గ్రాముల ధర
ఇప్పటికే అమెరికా, చైనాల మధ్య నెలకొనివున్న వాణిజ్య అస్థిరత బంగారానికి డిమాండ్ ను పెంచగా, సెంట్రల్ బ్యాంకులు మరోమారు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో గత మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో చైనా కంపెనీలు యూఎస్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాకుండా బిల్ పాస్ కావడంతో దాని ప్రభావం బులియన్ మార్కెట్ పై పడి ధరలు తగ్గాయని విశ్లేషకులు అంచనా వేశారు.