శ్రామిక్ రైళ్ల విషయంలో మార్గదర్శకాలను సవరించిన కేంద్రం
- ఇక గమ్యస్థాన రాష్ట్రం అనుమతి అవసరం లేదు
- అవసరమైన వివరాలను రైల్వేకు అందిస్తే సరిపోతుంది
- హోంశాఖ అనుమతితో శ్రామిక్ రైళ్లను నడుపుతుంది
అయితే, ఇప్పుడు ఇలాంటి అంగీకారాలేమీ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్) జారీ చేసింది. దాని ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలోని వలస కార్మికులను పంపడానికి అవసరమైన వివరాలను రైల్వే శాఖకు అందిస్తే సరిపోతుంది. అనంతరం కేంద్ర హోంశాఖ అనుమతితో రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతుంది.