రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం కుదరదని ప్రధానికి తెలిపిన సీఎం కేసీఆర్
- ప్రయాణికుల రైళ్లను నడపవద్దని కోరిన సీఎం కేసీఆర్
- ప్రధాన నగరాల్లో కరోనా ఎక్కువగా ఉందని వెల్లడి
- అన్ని రాష్ట్రాలు వలస కూలీలను అనుమతించాలని విజ్ఞప్తి
అంతేగాకుండా, వలస కూలీల అంశంపైనా సీఎం కేసీఆర్ ప్రధానితో మాట్లాడారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని, వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగా ప్రభావితమైందని, అప్పులు చెల్లించే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రాల రుణపరిమితి పెంచాలని, రుణాల రీషెడ్యూల్ చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.