Devineni Uma: ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్‌ జగన్‌ గారు!: గ్యాస్‌ లీక్‌పై దేవినేని ఉమ

devineni fires on ycp
  • సునామీ, హుద్ హుద్ , తిత్లీలను విశాఖ ఎదుర్కొంది
  • ఎల్జీ కంపెనీ వల్ల వేలాది మంది భయం గుప్పెట్లో ఉన్నారు
  • ప్రభుత్వ సాయం అందించాలని మీకు తెలియదా?  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శలు గుప్పించారు. 'సునామీ, హుద్ హుద్ , తిత్లీలు తట్టుకొన్న విశాఖలో నేడు ఎల్జీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ప్రజలు గ్రామాలు వదిలి భయం గుప్పెట్లో రోడ్లపై గడుపుతున్నారు. రాజప్రాసాదాల్లో ఉన్న నాయకులారా మీకు కనిపించడం లేదా పునరావాసం, ప్రభుత్వ సాయం అందించాలని? ఈ విషయాన్ని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్‌ జగన్ గారు' అని దేవినేని ఉమ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.  ఈ సందర్భంగా పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.  

కాగా, గ్యాస్ లీక్‌ దుర్ఘటనతో విశాఖ శివార్లలోని గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయని వార్తా పత్రికల్లో రాశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంపెనీకి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలంతా తరలివెళ్లాలని ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించిందని, దీంతో ప్రజలంతా భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లారని పేర్కొన్నారు. దాదాపు 20 ప్రాంతాలకు చెందిన ఏడు లక్షల మంది తరలిపోయారని తెలిపారు.
Devineni Uma
Telugudesam
Andhra Pradesh
Vizag Gas Leak

More Telugu News