నితిన్ జోడీగా మరో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్
- నితిన్ తాజా చిత్రంగా 'రంగ్ దే'
- లైన్లో రెండు ప్రాజెక్టులు
- 'పవర్ పేట'లో కీర్తి సురేశ్
ఈ సినిమాలో కీర్తి సురేశ్ తన పాత్రలో ఇమిడిపోయిందిట. ఆమె నటన .. నటన పట్ల ఆమెకి గల అంకితభావాన్ని చూసిన నితిన్, మరో సినిమాలోనూ కథానాయికగా ఆమెనే తీసుకున్నాడని తెలుస్తోంది. 'రంగ్ దే' తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన 'పవర్ పేట' చేయనున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ కి ఛాన్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా నిర్మితం కానున్నట్టుగా తెలుస్తోంది. ఇటు 'రంగ్ దే' చిత్రంలో .. అటు 'పవర్ పేట' మూవీలో నితిన్ సరసన నాయికగా కీర్తి సురేశ్ ఏ స్థాయిలో మార్కులు కొట్టేస్తుందో చూడాలి.