శ్రామిక ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయం
- వలస కార్మికుల కోసం కేంద్రం చర్యలు
- రైలు సేవలు వినియోగించుకునేలా మార్గదర్శకాల్లో సవరణలు
- ఉత్తర్వులు జారీ చేసిన హోంమంత్రిత్వ శాఖ
శ్రామిక ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో నిలిచినవారిని స్వస్థలాలకు తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైలు సేవలు వినియోగించుకునేలా మార్గదర్శకాల్లో సవరణ చేసింది. అంతేగాకుండా, వలస కార్మికులు, కూలీల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుని రైల్వే శాఖను సంప్రదించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అటు రైల్వే ఉన్నతాధికారులు కూడా అన్ని జోనల్ మేనేజర్లకు ప్రత్యేక ఆదేశాలు పంపారు.