సౌదీ అరేబియాలో కరోనా జోరు.. 11 మంది భారతీయుల మృతి

  • మక్కాలో ఒకరు, మదీనాలో నలుగురు మృతి
  • సౌదీలో ఇప్పటి వరకు 13,930 మందికి కరోనా
  • కరోనాతో 121 మంది మరణం
బతుకుదెరువు కోసం ఎడారి దేశం సౌదీ అరేబియాకు వెళ్లిన 11 మంది భారతీయులను కరోనా రక్కసి కాటేసింది. కరోనా బారిన పడి 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. మదీనాలో నలుగురు, జెడ్డాలో ఇద్దరు, మక్కాలో ముగ్గురు, రియాద్, దమ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని వెల్లడించారు. సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులంతా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. మరోవైపు సౌదీలో ఇప్పటి వరకు 13,930 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 121 మంది మృతి చెందారు.

saudi arabia
Indians
Corona Virus
Dead
Mecca
Madina

More Telugu News