గుజరాత్ సీఎంకు ఫోన్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్!
- గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు
- వారిని ఆదుకోవాలని విజయ్ రూపానీకి విజ్ఞప్తి
- అన్ని విధాలా ఆదుకుంటామని రూపానీ హామీ
"గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్ సీఎం విజయ్రూపానీకి ఏపీ సీఎం వైయస్ జగన్ ఫోన్. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన సీఎం వైయస్ జగన్. సానుకూలంగా స్పందించిన సీఎం రూపానీ, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ" అని ట్వీట్ పెట్టింది.