ఏపీలో మరో 14 మందికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 266కి చేరింది. కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురంలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు కర్నూలులో అత్యధికంగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 34 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు మొత్తం ఐదుగురు కరోనా నుంచి కోలుకున్నారు.

ఆయా జిల్లాలలో కరోనా బాధితుల సంఖ్య..
      

Corona Virus
14 incresed

More Telugu News