‘కరోనా’ కట్టడికి ట్యూన్ కట్టిన సినీ సంగీత దర్శకుడు కీరవాణి!
- జూనియర్ ఎన్టీఆర్ ’సినిమా స్టూడెంట్ నెం.1’
- ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ..’ పాట ట్యూన్ తో ఈ పాట పాడిన కీరవాణి
- ‘ఓ మైడియర్ గార్ల్స్, డియర్ బాయ్స్..’ అంటూ పాట ప్రారంభం
‘ఓ మైడియర్ గార్ల్స్, డియర్ బాయ్స్..డియర్ మేడమ్స్.. భారతీయులారా..’ అంటూ సాగే ఈ సాంగ్ లో ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..’ అంటూ తన పాటను పాడారు. ఈ సందర్భంగా ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పాటించాల్సిన ముందు జాగ్రత్తలను తన పాట ద్వారా సూచించారు. ‘కరోనా’ కట్టడికి పాటుపడుతున్న వైద్య ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి తన కృతఙ్ఞతలు తెలిపారు. చివరగా, ‘వుయ్ విల్ స్టే ఎట్ హోమ్.. వుయ్ స్టే సేఫ్’ అంటూ తన పాట ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు.