విజయవాడ కృష్ణలంకలో రాకపోకలపై కట్టడి... కరోనా పాజిటివ్ కేసుతో అలర్ట్‌

  • ఈ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి వైరస్
  • దీంతో అలర్టయిన అధికారులు
  • స్వీయ నియంత్రణ పాటించాలంటూ నివాసితులకు కలెక్టర్‌ పిలుపు
విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. రాణిగారి తోటకు చెందిన అరవై ఐదేళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు రాకపోకలను కట్టడి చేశారు. ప్రజలు కూడా స్వీయ నియంత్రణలు పాటిస్తూ రాకపోకలను బంద్‌చేసి సహకరించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ విజ్ఞప్తి చేశారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా రోడ్లపై హైడ్రోక్లోరైడ్‌ ద్రావకం, బ్లీచింగ్‌ చల్లారు. మొత్తం కృష్ణలంక పరిధిలో ఉన్న 16, 17, 18, 20, 21, 22 డివిజన్ల నివాసితులు పూర్తిగా బంద్‌ పాటించాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్‌ కోరారు.


More Telugu News

Vijayawada krishnalanka Corona Virus tight security