అర్ధరాత్రి సుప్రీం తలుపు తట్టిన నిర్భయ దోషులు.. చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలం!
- పటియాలా హౌస్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టుకు
- హైకోర్టు సమర్థించడంతో సుప్రీంకు
- అర్ధరాత్రి అత్యవసరంగా విచారించిన అత్యున్నత ధర్మాసనం
జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం దోషుల పిటిషన్ను అర్ధరాత్రి అత్యవసరంగా విచారించింది. దోషులు పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేసిన కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో శిక్ష అమలుకు లైన్ క్లియర్ అయింది. దోషులను ఉరితీసే ముందు వారిని కలిసేందుకు కుటుంబ సభ్యులకు ఐదు, పదినిమిషాల సమయం ఇవ్వాలని వారి తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోరారు. ఇందుకు జైలు నియమాలు అనుమతించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తేల్చి చెప్పారు. మరోవైపు, ఉరిశిక్ష అమలుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో తీహార్ జైలు అధికారులు ఈ ఉదయం 5:30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.