టీడీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్​ రెడ్డి

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను రాజకీయాల్లోకి లాగుతారా?
  • ఆ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారు
  • బాబు ఎన్నో కుట్రలు పన్నుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను రాజకీయాల్లోకి లాగి ఆ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. టీడీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ‘పులివెందుల పంచాయతీ’, ‘రౌడీయిజం’ అంటూ విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఎన్నో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగిన చోట దౌర్జన్యాలు జరిగాయని రుజువు చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News

Gadikota Srikanth Reddy YSRCP Chandrababu Telugudesam Andhra Pradesh