Corona Virus: కరోనా జాతి వైరస్‌లను శరీరంలోకి ఎక్కించుకుంటే రూ.3 లక్షలు ఇస్తామంటోన్న లండన్‌ పరిశోధకులు

scientists offer on corona virus
  • కరోనా జాతికి చెందిన ఓసీ43, 229ఈ వైరస్‌లపై ప్రయోగాలు 
  • పరిశోధకుల ఆఫర్‌తో ముందుకొచ్చిన పలువురు
  • కొవిడ్‌-19 కలకలం నేపథ్యంలో చర్చనీయాశంగా మారిన పరిశోధన
కరోనా జాతికి చెందిన ఓసీ43, 229ఈ వైరస్‌లపై ప్రయోగాలు చేయాలనుకుంటున్న లండన్‌ పరిశోధకులు ఓ ఆఫర్‌ ఇచ్చారు. తమ పరిశోధనల కోసం కరోనాను శరీరంలోకి ఎక్కించుకున్న వారికి రూ.3 లక్షల చొప్పున బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో ఇందుకోసం చాలా మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు సమాచారం.

ఆరోగ్యంగా ఉన్న వారిని పలు బ్యాచులుగా విభజించి, వారికి ఈ కరోనా వైరస్‌లను ఎక్కించి, పరిశోధనలు జరుపుతారు. ఈ వైరస్‌లు ఎక్కించుకుంటే కాస్త శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ప్రాణాపాయం ఏమీ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా జాతికి చెందిన కొవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.
Corona Virus
London

More Telugu News