మోహన్ బాబు రాత్రిపూట రైస్ తిని 40 ఏళ్లుపైనే అయింది: రాజా రవీంద్ర

Raja Ravindra talks about Mohan Babu
  • మోహన్ బాబు డేట్స్ కూడా తానే చూస్తానని వెల్లడించిన రవీంద్ర
  • క్రమశిక్షణకు మారుపేరు అంటూ కితాబు
  • దగ్గర్నుంచి చూస్తే మోహన్ బాబు అర్థమవుతారని వ్యాఖ్యలు
టాలీవుడ్ నటుడు, కాల్షీట్ మేనేజర్ రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో అగ్రనటుడు మోహన్ బాబు గురించి చెప్పారు. మోహన్ బాబు చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని తెలిపారు. విష్ణు డేట్స్ తో పాటు మోహన్ బాబు డేట్స్ కూడా తానే చూస్తానని వెల్లడించారు. వాస్తవానికి మోహన్ బాబు చాలా మంచి వ్యక్తిని, కానీ బయటి వ్యక్తులు మరో విధంగా అనుకుంటారని వివరించారు. దగ్గర్నించి చూసి మోహన్ బాబు అంటే ఏంటో తెలుసుకోవచ్చని అన్నారు.

క్రమశిక్షణకు మారుపేరుగా మోహన్ బాబును అభివర్ణిస్తుంటారని, అందులో ఎలాంటి సందేహం లేదని రాజా రవీంద్ర చెప్పారు. ఉదయాన్నే 5 గంటలకు వాకింగ్ చేస్తారని, ఎంతో ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబిస్తారని తెలిపారు. తినే తిండి విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారని, ఆయన రాత్రి పూట రైస్ తిని దాదాపు 40 ఏళ్లు పైనే అయిందని వెల్లడించారు.
Go Back to Shorts
Raja Ravindra
Mohan Babu
Tollywood
Rice

More Telugu News