జగన్‌ ఆస్తుల కేసు మళ్లీ వాయిదా

Jagan property case hering on 13th of this month
  • ఈనెల 13వ తేదీన విచారించనున్నట్లు స్పష్టీకరణ
  • కోర్టుకు హాజరు కాని ఏపీ సీఎం జగన్‌
  • ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన లాయర్లు
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టు మళ్లీ వాయిదా వేసింది. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరుకాలేనంటూ జగన్‌ తన లాయర్ల ద్వారా వేసిన ఆబ్సెంట్‌ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో సహనిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసును ఈనెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
CBI
ED
Jagan
property case
postpone

More Telugu News