Revanth Reddy: ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు సహజం: రేవంత్‌రెడ్డి

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం అధికార పార్టీ తీరని, కానీ తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభం కలుగుతుందని కాంగ్రెస్‌ నాయకుడు, మల్కజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. గోపన్న‌పల్లి భూ ఆక్రమణల ఆరోపణలపై ఆయన ఈరోజు స్పందించారు. పనిచేయని ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తామని కేటీఆర్‌ చెబుతున్నారని, మరి ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌, కేటీఆర్‌లను ఏం చేయాలని ప్రశ్నించారు. వారు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Revanth Reddy
gopanpalli land scam
cases

More Telugu News