ఇప్పుడు తెలంగాణలో.. లేడీస్ హాస్టల్లోని స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపిన అబ్బాయి!
- సంచలనం సృష్టించిన నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన
- తాజాగా ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో
- వారికి సహకరించిన మరో ముగ్గురు అమ్మాయిలనూ కాలేజీ నుంచి తొలగించిన ప్రిన్సిపాల్
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయి గదిలో మరో ముగ్గురు ఉన్నప్పటికీ విషయం వెలుగులోకి రాలేదు. మరుసటి రోజు గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది అబ్బాయిని గమనించి ప్రిన్సిపాల్కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఎంఈవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి అబ్బాయి, అమ్మాయిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు. కాగా, వీరికి సహకరించిన మరో ముగ్గురిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేసి, వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.