నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రత కట్టుదిట్టం చేస్తాం: మంత్రి ఆదిమూలపు

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ యువకుడు ప్రవేశించి రాత్రంతా గడిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ అమ్మాయి సహకారంతో క్యాంపస్ లోకి చొరబడిన యువకుడు రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థినులు ఆ యువకుడు, విద్యార్థిని ఉన్న గదికి తాళం వేసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తప్పవని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రత మరింత పెంచుతామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Nujiveedu IIIT
Adimulapu Suresh
Security
Students

More Telugu News