తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. హైకోర్టులో వైయస్ వివేకా కుమార్తె పిటిషన్

  • ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖ
  • ఇప్పటికే ఇవే పిటిషన్లు వేసిన మరో ముగ్గురు
  • 2019 మార్చి 14న హత్యకు గురైన వివేకా
వైయస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ, ఏపీ హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే కేసు విచారణ తుది దశకు చేరుకుందని... ఈ తరుణంలో సీబీఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

2019 మార్చి 14న తన నివాసంలోనే వైయస్ వివేకా దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును సిట్ విచారిస్తోంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును విచారించింది. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు వైసీపీ, టీడీపీ నేతలను సిట్ అధికారులు విచారించారు.

Go Back to Shorts
YS Vivekananda Reddy
YS Sugunamma
High Court
Murder Case

More Telugu News