కోడలిని తీసుకుని తుళ్లూరు బయలుదేరిన నారా భువనేశ్వరి!
- అమరావతి రైతులకు పరామర్శ
- పలు గ్రామాల్లో పర్యటించనున్న చంద్రబాబు ఫ్యామిలీ
- ఇవి సంక్రాంతి నిరసనలంటున్న రైతులు
కాగా, నేడు జరిగేవి సంక్రాంతి సంబరాలు కాదని, సంక్రాంతి నిరసనలని అమరావతి పరిసర గ్రామాల రైతులు చెబుతున్నారు. తమ నుంచి భూములు తీసుకుని, తమకు నిలువ నీడ లేకుండా చేసి, ఇప్పుడు తమను రోడ్డుపై పడేశారని ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల కోసం చంద్రబాబు ఫ్యామిలీ, చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు పయనమవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అమరావతి రైతుల నిరసనల దృష్ట్యా, చంద్రబాబు సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటానని ముందే ప్రకటించారు.