ఉచితంగా లడ్డూలు ఇవ్వాలా? వద్దా?: టీటీడీలో కొత్త చర్చ
- ప్రతి భక్తునికీ ఓ ఉచిత లడ్డూ
- ఆపై రూ. 50కి ఓ లడ్డూ
- ఇంకా ఖరారు కాని విధివిధానాలు
దీనిపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో లడ్డూల పంపిణీపై విధివిధానాల రూపకల్పన చేస్తున్నామంటూ, శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. తిరుమలలోని పాత అన్నదాన సత్రం సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరిగింది. ఆపై హరీంద్రనాథ్ మాట్లాడుతూ, ఉచిత లడ్డూ పంపిణీపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, సాధారణ రోజులతో పాటు అన్ని పర్వదినాల్లోనూ అంతరాయం లేకుండా లడ్డూలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని మాత్రం నిర్ణయించామని వెల్లడించారు.